సికింద్రాబాద్, అక్టోబర్ 4: కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మద్దతు ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని, ఆయన లక్ష్యసాధనలో విజ యం సాధించాలని ఆకాంక్షించింది. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ వార్షిక ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు విచ్చేసి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశ ప్రజలు కేసీఆర్ పాలన కోరుతున్నారని, లక్షలాది మంది సభ్యులున్న వైఎంసీఏ మద్దతు కేసీఆర్కు సంపూర్ణంగా ఉన్నదని ప్రకటించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ మాట్లాడుతూ నేడు ప్రపంచదేశాల్లో ఎం తోమంది క్రీడాకారులను వైఎంసీఏ అందించిందని గుర్తుచేశారు. అలాగే కేసీఆర్కు మద్దతు ప్రకటిస్తూ క్రిస్టియన్ యూత్ ఫోలోషిప్ తెలంగాణ అధ్యక్షుడు రావులపాటి మోజస్ కాకినాడలో చేసిన తీర్మానప్రతిని తమకు అందజేసినట్టు ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు తెలిపారు.
కేసీఆర్ వెంటే మేమంతా..
ఖలీల్వాడి: సీఎం కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని క్రైస్తవ మతపెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం నిజామాబాద్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో కేసీఆర్కు మద్దతు ప్రకటించినట్టు సీఎస్ఐ మెదక్ బిషప్ ఏసీ సోలమన్రాజు తెలిపారు. సీఎం కేసీఆర్కు దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు.