హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్యూ) విద్యార్థులు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 14 మంది ఈ యూనివర్సిటీలో డాటా సైన్స్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేయగా, వారిలో 11 మందిని మైక్రోసాఫ్ట్ సంస్థ సెలెక్ట్ చేసుకున్నది.
ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాజమాన్యం అభినందించింది.