Weather Update | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎకువ ఆసారం ఉన్నదని, ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లోఅలర్ట్ జారీచేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదమున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్లోనూ వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు ఉదయం పొగమంచు పడొచ్చని పేర్కొన్నది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అల్లూరి, అంబేదర్ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అకడకడా పిడుగులతో కూడిన మోస్తరు, మిలిగిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
మంగళవారం యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కుమ్రంభీం జిల్లాలోని నెల్లిలో 2.7, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 2.1, సిరికొండలో 2, పిప్పల్ధారిలో 1.8, జైనథ్లో 1.7, ఆదిలాబాద్లో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేరొన్నారు. అకాలవర్షాలతో మామిడి, బత్తాయి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. మొకజొన్న, వరి వంటి పంటలు వడగండ్లతో నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తీరనినష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.