హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా శ్రీకారం చుట్టారు. తన ప్రచారాన్ని కేరళ నుంచి ఇవాళ ఆయన ప్రారంభించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. తనకు మద్దతుగా ఓటేయ్యాలని వారిని సిన్హా కోరారు. రేపు తమిళనాడులో పర్యటించనున్నారు. జులై 1న ఛత్తీస్గఢ్లో, 2న తెలంగాణలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం కానున్నారు.
యశ్వంత్ నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. తెలంగాణకు రావాలని ఆ రోజే సిన్హాను కేటీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో జులై 2న ఆయన తెలంగాణకు రానున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం కానున్నారు. అయితే యశ్వంత్ సిన్హాకే టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధినేత నిర్ణయించినట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.