హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): గర్భాశయ క్యాన్సర్తో దేశంలోప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి చెందడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల్లో దాదాపు 30% మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు. ‘గైనకాలజిక్ ఆంకాలజీ’లో అందుబాటులోకి వచ్చిన పురోగతులపై హైటెక్ సిటీలోని యశో ద హాస్పిటల్స్లో రెండు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ రోబోటిక్స్ కాన్ఫరెన్స్, లైవ్ వర్క్షాప్ శనివారం ప్రారంభమైంది. వెయ్యి మందికి పైగా గైనకాలజిస్టులు, క్యాన్స ర్ వైద్య నిపుణులు వర్క్షాప్లో పాల్గొన్నారు. గైనకాలజీలో అందుబాటులోకి వచ్చి న అత్యాధునిక రోబోటిక్ వైద్య విధానాలు, జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో ప్రత్యక్ష ఇంటరాక్టివ్ శిక్షణ సెషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీ య అధ్యాపకులు రోబోటిక్ శిక్షణ, లైవ్ సర్జరీ, వీడియో ఆధారిత బోధనతో గర్భాశయ క్యా న్సర్, అండాశయ క్యాన్సర్లో ప్రత్యక్ష రోబోటిక్ శస్త్ర చికిత్సలను ప్రదర్శించారు. వైద్య ని పుణులు మాట్లాడుతూ.. దేశంలో ఏడాది దా దాపు 50 లక్షల మంది గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్నారని, వారిలో 50% మంది మరణిస్తున్నారని తెలిపారు. 2030 నాటికి గర్భాశయ క్యాన్సర్ మరణాలు 50 శాతం పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ క్లినికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ రోబోటిక్ సర్జరీ గత దశాబ్ద కాలంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందని పేర్కొన్నారు.