హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. బుధవారం వరకు 11.08 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్టు పేర్కొన్నది.
నిరుడు ఇదే సమయానికి 12.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది అత్యధికంగా వరి 2.93 లక్షల ఎకరాల్లో సాగు కాగా, మొక్కజొన్న 2.50 లక్షల ఎకరాలు, పెసర 2.38 లక్షల ఎకరాలు, వేరుశనగ 1.8 లక్షల ఎకరాల్లో సాగైనట్టు పేర్కొన్నది.