PM Modi | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో చేనేత రంగం పాత్రపై సదస్సులో చర్చించాలని కోరారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడంలో మనదేశ అంకితభావాన్ని నొక్కి చెప్పాలని పేర్కొన్నారు.
చేనేత పద్ధతులతో పర్యావరణ అనుకూలమైన అంశాలను ప్రపంచం అనుసరించడానికి ఒక నమూనాను అందివ్వాలని కోరారు. స్థిరమైన ఫ్యాషన్, టెక్స్టైల్స్పై ప్రపంచ సహకారాన్ని పొందేందుకు దీనిని అవకాశంగా వినియోగించుకోవాలని సూచించారు.