హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమల వృత్తిని కించపరుస్తూ, మంత్రి తలసానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే యాదవులకు క్షమాపణ చెప్పాలని యాదవ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ తీరు హేయమని మండిపడ్డారు. యాదవ కులాన్ని, వృత్తిని దూషించండం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రకుల దురహంకారానికి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు నిదర్శనమని దుయ్యబట్టారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్యాదవ్, శ్రీనివాస్యాదవ్, సుధాకర్యాదవ్, శ్రీనివాస్యాదవ్, పవన్కుమార్యాదవ్, మల్లయ్యయాదవ్ రేవంత్ తీరును తప్పుబట్టారు.