యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి(Laxminarasimha Swamy) ఆలయానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్(Mla Vivekananda) భారీ విరాళాన్ని(Donation) అందజేశారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy), ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావులతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద ఆదివారం స్వామివారని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన విమాన గోపురం స్వర్ణ తాపడానికి రూ. 55, 03,980 విరాళనాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన నగదును ఆలయ డీఈవో దోర్భాల భాస్కర్ శర్మకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడు యాదగిరి గుట్టను దర్శించుకునే విధంగా ఆలయాన్ని సీఎం కేసీఆర్(CM KCR) అద్భుతంగా నిర్మించారని తెలిపారు.
స్వామివారి దయతో మహారాష్ట్ర లో సైతం బీఆర్ఎస్ జెండా ఎగురబోతుందని తెలిపారు. స్వామివారికి మొక్కుకు తీర్చేందుకు నియోజకవర్గ ప్రజల తరపున విరాళం సమర్పించామని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు.