యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి నిజాం నవాబు వంశస్థులు బంగారు కానుక సమర్పించారు. ప్రధానాలయ పునః ప్రారంభానంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిజాం కుటుంబ సభ్యుల తరఫున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గన్ 67 గ్రాముల లక్ష్మీ హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావుకు అందజేయగా.. ఆదివారం ఆయన ఆలయంలో ఈవో ఎన్ గీతకు అప్పగించారు.
గతంలో హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన ఓ ముస్లిం కుటుంబం స్వామివారి తిరుకల్యాణోత్సవంలో అమ్మవారికి సారెతోపాటు వెండితో తయారు చేసిన పెండ్లి కానుకలు అందజేసేవారు. గతంలో ఈ ఆలయ అభివృద్ధికి హితోధికంగా సహకరించేవారని పలువురు చెప్తున్నారు. తాజాగా నిజాం నవాబుల కుటుంబం తరఫున స్వయంగా కానుకను అందించడం తొలిసారి అని చెప్పొచ్చు.