యాదగిరిగుట్ట, మార్చి 29: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల య రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ సామాజిక మాధ్యమాల్లో బుధవారం అప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోపురంపై సూర్యకిరణాలు పడిన ఫొటోను ఫేస్బుక్ పేజీలో అప్లోడ్ చేసింది.
వసంత రుతువులో సూర్యకాంతి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తాకినప్పుడు ఇలా ఉంటుందని పేర్కొన్నది. ఈ చిత్రా న్ని పిక్ ఆఫ్ ది డేగా పరిగణిస్తున్నామంటూ తెలిపింది. ఇంతటి అద్భుతమై న ఫొటోను క్లిక్చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది. నెటిజ న్లు స్పందిస్తూ ఆలయం అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.