యాదగిరిగుట్ట, ఆగస్టు 25 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ జరుగనున్నది.
సాయంత్రం 6 గంటలకు ఉత్సవాలను ప్రధానార్చకుల బృందం ప్రారంభించనున్నది. సోమవారం వరకు సాగే ఉత్సవాలకు ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపం ఎదురుగా ఏర్పాట్లు చేశారు.