యాదాద్రి, డిసెంబర్21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి దర్బార్ సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. బుధవారం సాయం త్రం ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం గావించారు. స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చి మంత్రపుష్ప నీరాజనం గావించి ఆశీర్వచనం చేశారు. ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ వైభవంగా సాగింది.
స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారి తిరుచ్చి సేవపై వేంచేపు చేసి ఆలయ తిరుమాడవీధుల్లో జరిపారు. స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, ఆమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా సాగాయి. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా ఆండాళ్ అమ్మవారిని తిరుప్పావై పూజలు సాగాయి. కాగా, స్వామివారిని 14 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.18,83,947 ఆదా యం సమకూరిన్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.