యాదాద్రి, జూన్ 21: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేశారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయ ప్రాకారంలో లక్ష్మీనరసింహులకు సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణోత్సవాన్ని నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యపూజలు ఘనంగా కొనసాగాయి. స్వామివారి ఖజానాకు రూ.16.84 లక్షల ఆదాయం సమకూరింది. ఏడు రోజుల్లో హుండీ ఆదాయం రూ.67,13,089 తోపాటు 58 గ్రాముల మిశ్రమ బంగారం, 1,450 గ్రాముల మిశ్రమ వెండి వచ్చింది.