యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నారు. బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన నేడు యాదగిరీశుడు మురళి కృష్ణుడి (శ్రీ కృష్ణాలంకారం) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7 గంటలకు పొన్నవాహన అలంకార సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. పొన్నవాహనంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతారు.
కాగా, ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నది. ఉచిత దర్శనాని 1 గంట 30 నిమిషాల సమయం పడుతున్నది. 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హంసవాహనంలో ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు.