యాదాద్రి, జనవరి 2 : యాదాద్రి ఆలయం మహాద్భుతంగా నిర్మించారని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖుబా అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని ఆదివారం ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
స్వామివారి బాలాలయ ముఖ మండపంలో అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని మంత్రి పరిశీలించారు. యాదాద్రి దేశంలో మహాద్భుతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
స్వామివారి దర్శనం జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అభివర్ణించారు. దేశ ప్రజలంతా సుఖసంతోషాలు, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.