యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు మంగళవారం రూ. 6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.76,500, రూ. 100 దర్శనం టిక్కెట్ ద్వారా 33,500, వేద ఆశీర్వచనం ద్వారా 6,192, నిత్యకైంకర్యాల ద్వారా 400, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 3,100, వ్రత పూజలతో 18,500, కల్యాణకట్ట టిక్కెట్లతో
11,400, ప్రసాద విక్రయం ద్వారా 3,90,135, వాహన పూజలతో 5, 300, టోల్గేట్ ద్వారా 610, అన్నదాన విరాళం ద్వారా 601, సువర్ణ పుష్పార్చనలతో 55,600, యాదరుషి నిలయం ద్వారా 23,500, పాతగుట్ట నుంచి 14,827, ఇతర విభాగాలతో 22,113 మొత్తంగా రూ. 6,70,744 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు.