యాదాద్రి భువనగిరి : యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సోమవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాబోవు రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని యాదాద్రీశుడిని వేడుకున్నట్లు వెల్లడించారు.