యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఉదయం 4గంటల నుంచి ప్రారంభమయ్యా యి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్యకల్యాణం నిర్వ హించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో లక్ష్మీనరసింహుల నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
తొలుత సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. మహామండపంలో అష్టోత్తరం నిర్వహించారు.సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మ వార్ల ఆశీస్సులు అందజేశారు. పాతగుట్టలో లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య పూజలు ఆలయ సంప్రదాయ రీతిలో కొన సాగాయి.
యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రముఖులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని మహారాష్ట్ర ఆదాయపన్ను శాఖ కమిషనర్ మాధవి, మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్గోపాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు,అధికారులు స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదం అందజేశారు.