యాదగిరి గుట్ట, భువనగిరి : యాదాద్రి, భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Laxmi Narasimha Swamy) ఆలయంలో ఈనెల 27 నుంచి రెండు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Pavitrotsavam) నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహాణాధికారి ఎన్.గీత ( EO Geeta) వెల్లడించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ రెండు రోజుల పాటు శ్రీ స్వామి వారి నిత్య, శాశ్వత కల్యాణం (Kalyanam) , నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం ( Brahamotsavam), లక్షపుష్పార్చన, శ్రీ సుదర్శన నారసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 29 నుంచి యథావిధిగా శ్రీ స్వామి వారి నిత్యకైంకర్యములు జరుగుతాయని పేర్కొన్నారు.