హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీష్ రెడ్డి నియామకం అయ్యారు. సతీష్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నారు. వీరిద్దరూ తమ పదవుల్లో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సతీష్ రెడ్డి 1981, ఆగస్టు 25న ములుగు మండలం దేవగిరిపట్నంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. బీటెక్(ఈసీఈ) చదివారు. టీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకుడిగా చేరి.. ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2012 నుంచి 2019 వరకు స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ప్రగతి నివేదన సభ మీడియా కమిటీ మెంబర్గా కూడా పని చేశారు. 2020 నుంచి టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నారు.
అనిల్ కుర్మాచలం 1979, మార్చి 8న కరీంనగర్లోని రామ్నగర్లో జన్మించారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన ఆయన.. లండన్లో ఐటీ కన్సల్టెంట్గా కొనసాగుతున్నారు. దశాబ్దం క్రితం లండన్లో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ను స్థాపించారు. అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పర్యవేక్షణలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ చాప్టర్స్ను వివిధ దేశాల్లో ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత.. రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని, పర్యాటకంతో పాటు సాంస్కృతిక రంగాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికలో అనిల్ కుర్మాచలం కీలకపాత్ర పోషించారు. అనిల్కు భార్య, కుమార్తె ఉన్నారు.