హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను రెడ్కో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్లను మంత్రి కేటీఆర్ అభినందించారు. తమకు కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినందుకు కేటీఆర్కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం ఈ పదవుల్లో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు.
సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో ఇవాళ సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం ఆశీస్సులను తీసుకున్నారు. తమ మీద నమ్మకంతో పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఇచ్చిన బాద్యతలను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తానని సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం తెలిపారు.