ధర్మపురి, మార్చి 9: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దక్షిణ దిగ్యాత్ర ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పోలీసు సిబ్బంది స్టేషన్కు తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. స్వామివారు దక్షిణం వైపు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని దక్షిణ దిగ్యాత్రగా చెప్తారు.
ఈ దిగ్యాత్రలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి (యోగ, ఉగ్ర) ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి కళాకారుల ప్రదర్శనల మధ్య సాయంత్రం దక్షిణ దిశలోని పోలీస్ స్టేషన్ వైపు తీసుకెళ్లారు. జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు ప్రకాశ్, రవీందర్రెడ్డి, ఎస్బీ సీఐ రాజశేఖర్రావు, ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు కిరణ్కుమార్, రామకృష్ణ, నరేశ్, దత్తాత్రి, పోలీస్ సిబ్బంది స్వామివారిని లోపలికి తీసుకెళ్లారు. అనంతరం పోలీస్స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, వారి ఎదుట ఆయుధాలను ఉంచి పూజలు చేశారు.