హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్-2 మంగళవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. టీహబ్-2తో మంత్రి కేటీఆర్ మరోసారి భారత్ను ప్రపంచపటంలో నిలిపారని టెక్ మహీంద్ర ఎండీ అండ్ సీఈవో సీపీ గుర్నానీ ప్రశంసించారు. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ అనేది సరైన ట్యాగ్. ఆవిష్కరణలను ప్రోత్సహించడం నేటి అవసరం. భారతదేశాన్ని మరోసారి ప్రపంచపటంలో నిలిచేలా చేసిన కేటీఆర్కు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్పై తెలంగాణకు ఉన్న శ్రద్ధను చూస్తుంటే ఆనందంగా ఉన్నది. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తిదాయకం’ అని పానసోనిక్ ఇండియా చైర్మన్, సీఈవో మనీశ్ శర్మ పేర్కొన్నారు. ‘టెక్నాలజీ రంగంలో ఇంత తాపత్రయం చూడటం ఆశ్చర్యంగా ఉన్నది. టీహబ్ 2.0కు అభినందనలు. భవిష్యత్తు తరాలు టీహబ్ నేతృత్వంలో టెక్నాలజీ అభివృద్ధిని చూస్తాయి..’ అని ఇంటెల్ ఇండియా హెడ్ నివృతి ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్కు చెందిన తొలి టీహబ్ అనేక స్టార్టప్లకు, పెట్టుబడిదారులకు ప్రపంచ వేదికగా నిలిచింది. ఇప్పుడు రెండోదానికి అభినందనలు. ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్నాం. భవిష్యత్తు తరాలకు అవసరమైన గ్రేట్ విజన్ కేటీఆర్ సర్’ అని సినీహీరో రాణా దగ్గుబాటి, సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ట్వీట్ చేశారు.