హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు మంచి కార్యక్రమమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. మంగళవారం హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఆధ్వాన్నంగా మారిందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.