హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర ప్రభు త్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ప్రధానంగా టెక్నాలజీ ఎక్సేంజ్, ఇన్నోవేషన్స్పై దృష్టి సారించనున్న ఈ సదస్సు లోగోను టీహబ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనాలని తెలుగు టెకీలకు సూచించారు. టీటా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తల మాట్లాడుతూ.. టీటా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగపూర్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం సంతోషకరమన్నారు. సదస్సులో రాష్ట్ర మంత్రులతోపాటు పలు దేశ, విదేశ కంపెనీలు, స్టార్టప్లు, స్టూడెంట్ ఇన్నోవేటర్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం లో టీటా రాష్ట్ర కార్యదర్శి వినయ్ తూము, సభ్యులు శ్రీనివాస్ మర్రి, శ్రావణి బాసరాజు, క్రాంతి, వైద్యనాథ్ పాల్గొన్నారు.