హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నార్వే మాజీ మంత్రి, గ్రీన్బెల్డ్ అండ్ రోడ్ ఇన్స్టిట్యూట్ సంస్థ స్థాపకుడు ఎరిక్సొల్హీమ్ పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం ద్వారా దశాబ్ద కాలంలోనే 7% అడవులు పెరగడం అద్భుతమని ప్రశంసించారు. శుక్రవారం ఆయ న బేగంపేటలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్తో కలిసి మొకలు నాటారు. ఈ సందర్భంగా ఎరిక్ మాట్లాడుతూ.. అందరం కలిసి పని చేస్తే, సాధించలేనిదంటూ లేదనే తన ఆశయానికి ఎంపీ సంతోష్ ప్రతిరూపంగా కనిపించారని కొనియాడారు.
ఆయన ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్లో భాగంగా ప్రతిరోజూ ప్రపంచంలో ఎకడో ఒకచోట నిరంతరం మొకలు నాటే కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటూ చాలామంది పర్యావరణ మిత్రులు చెప్పారని తెలిపారు. ప్లాస్టిక్ భూతం నేలను, మానవాళిని తినేస్తున్నదని, ఇది ఆగిపోవాలంటే ప్రతి ఒకరూ సంతోష్కుమార్ కావాలని అన్నారు. తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గురు పర్యావరణవేత్తలకు గ్రీన్ చాలెంజ్ విసురుతున్నట్టు ప్రకటించారు. అనంతరం సంతోష్కుమార్ తమ సంస్థ రూపొందించిన వృక్షవేదం, హరితహా సం, వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ టేబుల్బుక్స్ను ఎరిక్సొల్హీమ్కు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప పర్యావరణవేత్త, ప్రకృతి ప్రేమికుడు ఎరిక్ సొల్హీమ్తో కలిసి మొకలు నాటడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో ప్రొకె్లైమ్ సీఈవో కెవిన్ కందస్వామి, సీవోవో శశిధర్తోపాటు గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు రాఘవ, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.