హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్, పటాన్చెరు, నల్లగొండ, సంగారెడ్డి పట్టణాలలో వాయు నాణ్యత మెరుగుపడిందని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 వెల్లడించింది. వరుసగా ఐదు సంవత్సరాలలో నమోదైన వాయు నాణ్యత ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2019 నుంచి 2023 మధ్య హైదరాబాద్లో గాలి నాణ్యత మెరుగుపడినట్టు ఆ నివేదిక పేర్కొంది. గాలిలోని దుమ్ము, ధూళి కణాల (పీఎం10 -మైక్రాన్లు) సాంద్రత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపడినట్టు తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం భారత్ వాయుకాలుష్య దేశాల్లో 3వ స్థానంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న చర్యలతో గడిచిన ఐదేండ్లలో హైదరాబాద్, పటాన్చెరు, నల్లగొండ, సంగారెడ్డిలో గాలి నాణ్యత మెరుగుపడినట్టు ఆ నివేదిక తెలిపింది. కాలుష్య నియంత్రణకు బ్లాక్-టాపింగ్, పాట్హోల్స్ లేని రోడ్ల నిర్వహణ, గ్రీన్బెల్ట్ అభివృద్ధి, చెత్త రీసైక్లింగ్, అనధికార డంపింగ్ పర్యవేక్షణ, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాల విధింపు వంటి చర్యలు చేపట్టింది.