హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో నమ్మకం కలిగేలా పనిచేయాలని పోలీసులకు డీజీపీ అంజనీకుమార్ సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖలో అమల్లో ఉన్న సంస్థాగత నిర్మాణం, ఫంక్షనల్ వర్టికల్స్ అంశాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ విభాగం అధికారులతో చర్చించారు.
ప్రతి పోలీసు అధికారి తమకు ప్రత్యేకంగా కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అధికారులు సమీక్షించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా.. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.