హైదరాబాద్ : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..నా అభ్యర్థిత్వంపై ఎనలేని విశ్వాసం ప్రదర్శించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించారు. అందుకు ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసాను. గొప్ప అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా నాపై, నా అభ్యర్థిత్వంపై ఎనలేని విశ్వాసం ప్రదర్శించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే కరోనా కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కవిత తెలిపారు.