హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతి పట్టణ స్థానిక సంస్థలో ఘ నంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్న ట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉత్సవాలను మా ర్చి 8 నుంచి 14 వరకు సమాజంలోని మహిళల శక్తి ని, పాత్రను తెలియజేసేవిధంగా నిర్వహించాలని, ఇందుకు కార్యాచరణ రూపొందించాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాలకు వివిధ శా ఖల్లో పని చేస్తున్న ఉన్నతాధికారు లు, విభాగాధిపతులు, మహిళా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారు, మ హిళా జడ్జిల వంటి వారిని ముఖ్య, ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని సూచించారు. దీంతో మహిళా వారోత్సవాలను ఘ నంగా నిర్వహించేందుకు పురపాలకశాఖ కార్యాచరణ ప్రకటించింది. శాఖలో కీలకపాత్ర పోషించే, పురపాలికల్లో వివిధ హోదాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోలతో వారోత్సవాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు.
ప్రతి మున్సిపాల్టి, మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించే కార్యక్రమాలు