హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన మహిళాబిల్లును తక్షణమే అమ లు చేయాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి డి మాండ్ చేశారు. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కావడం సంతోషించదగిన విషయమని పేర్కొన్నారు. ఒకవైపు రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూనే కేంద్రం దాని అమలు కు ఇతర అంశాలతో ముడిపెట్టడం నిరాశపరచిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో 50% స్థానాలు మహిళలకు కేటాయించి, మార్కెట్ కమిటీల్లో నూ రిజర్వేషన్లు కల్పించి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు చట్టసభల్లోనూ ప్రతిభను చాటుకుంటారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. మహిళలకు రాజకీయాధికారం దక్కితేనే అన్ని రంగాలు పురోగమిస్తాయని పేర్కొన్నారు.