మంచిర్యాల : కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా(Mancherial Dist) జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీకి తాగునీరు(Drinking water) సరఫరా చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు(Womens protest )దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
గ్రామంలోని బావులు అడుగంటి పోయాయని, మిషన్ భగీరథ లైను వేయక తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేవారు. ఇకనైనా మండల అధికారులు స్పందించి ట్యాంకర్లద్యారా తాగు నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, శ్రీలత, నాగలక్ష్మి,రవి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.