హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): నల్లగొండలో యువతిపై ఉన్మాది దాడికి పాల్పడిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ దాడిపై కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తీ వ్రంగా స్పందించారు. ఆ ఉన్మాదిని వెం టనే అదుపులోకి తీసుకోవాలని, ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని బుధవారం ఆమె నల్లగొండ జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం, మహిళా కమిషన్ అన్ని వి ధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాం టి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రేమ పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని గతంలోనే ఆదేశించినప్పటికీ దాడులకు అడ్డుకట్ట పడకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉన్మాదుల నుంచి మహిళలకు సమస్యలు ఎదురైతే ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.