వర్సిటీగా మారనున్న కోఠి మహిళా కాలేజీ
హైదరాబాద్, మార్చి 7 : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ రాష్ట్ర సర్కారు మహిళలకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీకి భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కోఠి మహిళా కాలేజీని మహిళా యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదించి, రూ. 100 కోట్లు అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. ప్రతిపాదిత మొత్తాన్ని ఒకే బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మహిళా విశ్వవిద్యాలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయిండం పట్ల విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.