హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఉమెన్సేఫ్టీ కోర్ కమిటీలోని మహిళా ఉన్నతాధికారులు బుధవారం ములుగులోని తెలంగాణ రాష్ట్ర అటవీ శిక్షణా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్, ప్రియాంకవర్గీస్ , మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు పాల్గొన్నారు. వీరిని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్లో అభినందించారు.