పెద్దపల్లి : పురిటినొప్పులతో ఉన్న గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా 108 వాహనంలోనే(108 Vehicle) ప్రసవించింది. 108 సిబ్బంది ఆమెకు ప్రసవం(Women Delivery) చేసి..తల్లి, బిడ్డను కాపాడారు. ఈ సంఘటన పెద్దపల్లి(Peddapalli Dist) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన మైస సోనియా(24) పురిటి నొప్పులతో బాధపడుతూ రాత్రి 9గంటలకు మేడారం ప్రభుత్వ దవాఖానలో చేరింది.
అక్కడ డెలివరీ కాకపోవడంతో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. మేడారం నుంచి పెద్దపల్లి జిల్లా మాతా శిశు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో అంబులెన్స్లో నొప్పులు అధికమయ్యాయి. వెంటనే 108 సిబ్బంది ఈఆర్సీపీ డాక్టర్ సూచన మేరకు అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. సోనియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వీరిని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు దవాఖానకు తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. కాగా, 108 సిబ్బందికి సోనియా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.