హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. వీటి అప్గ్రేడేషన్ కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి కేంద్ర అధికారులకు లేఖలు రాశారు. అన్ని అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు మోదీ సర్కారు అడిగిన సమాచారాన్నంతా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే అప్గ్రేడ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్రాన్ని నివేదించగా, మోదీ సర్కారు దిగివచ్చి, అప్గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడించింది.
వేతన బాధ్యత రాష్ర్టానిదే
మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ వాటిలో పనిచేసే టీచర్లకు ప్రస్తుతం ఇస్తున్న 3,500 వేతనానికి అదనంగా రూ.1,000 మాత్రమే పెంచి ఇస్తామని పేర్కొన్నది. కానీ, మెయిన్ అంగన్వాడీలుగా మారిన మినీ అంగన్వాడీ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,650 వేతనం ఇవ్వనున్నది. ఇందుకయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది. సహాయకులకు కేంద్రం కేవలం రూ.2,250 మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో 5,500 కలిపి సహాయకులకు 7,800 వేతనాన్ని ఇస్తున్నది.
కష్టాలను తొలగించాం
కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మన బిడ్డల బాగోగులను మనమే చూ సుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దేశంలో ఎకడా లేనివిధంగా మన అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని నిర్ణయించాం.
– మంత్రి సత్యవతి రాథోడ్