నల్లగొండ: జిల్లాలోని చండూరు మండలంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందిన నకరికంటి అశ్విని (25) ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు ఇద్దరు ఏడు నెలల బాబు సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అత్తింటి వారే చంపి ఫ్యాన్కి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అశ్విని తరఫు
బంధువులు ఆరోపిస్తు్న్నారు.
కాగా, మృతురాలి తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో తమ కూతురి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.