Brain stroke | రఘునాథపాలెం : ఇటీవల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలున్నాయి. వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వివాహ వేడుకలో డీజే సౌండ్తో పెళ్లి కొడుకు మృతి చెందాడు. తాజాగా ఖమ్మం జిల్లాలో డీజే సౌండ్ కారణంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు పాటలకు స్టెప్పులేసిన మహిళ.. విపరీతమైన శబ్దాలకు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దాలకు ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈ నెల 16న ఖమ్మం నగరంలోని అల్లిపురంలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలేనికి చెందిన తెనుగూరి రాణి (33) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త ఉప్పలయ్య మతిస్థిమితం కోల్పోవడంతో తన ఇద్దరు కుమార్తెలను ఆమె పోషిస్తున్నది. ఈ నెల 16న ఖమ్మం అల్లిపురంలోని తన మేనత్త కుమారుడి వివాహానికి వెళ్లింది. పెళ్లి అనంతరం అర్ధరాత్రి జరిగిన బరాత్లో డీజే పాటలకు తోటి బంధువులతో కలిసి ఆమె డ్యాన్స్ చేసింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆమెను పైకిలేపే ప్రయత్నం చేశారు. అప్పటికే స్పృహ కోల్పోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరో గుండె పోటు. Dance చేస్తూ కుప్పకూలిన మహిళ. pic.twitter.com/HyxWsgxi0Z
— RameshVaitla (@RameshVaitla) March 19, 2023