నిజామాబాద్ : నిజామాబాద్లో దారుణం వెలుగు చూసింది. మహిళను ఆటోలో అపహరించిన ఇద్దరు దుండగులు ఆమెపై లైంగిక దాడి చేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గుండారం చెరువులో పడేశారు. అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆటోడ్రైవర్ బాలాజీతోపాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.