Uppal | ఉప్పల్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): టీవీ చానల్ యాంకర్పై మోజు పెంచుకొని, ఓ మహిళ అతడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. వారి చెరనుంచి బయటపడిన యాంకర్ ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్లో నివాసముండే ప్రణవ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఓ చానల్లో యాంకర్గా కూడా పనిచేస్తున్నారు. త్రిష్ణ అనే మహిళ మాదాపూర్లో డిజిటల్ మార్కెటింగ్లో పనిచేస్తున్నది. రెండేండ్ల క్రితం ఆమెకు ఓ మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫొటో ప్రొఫైల్గా కలిగిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.
అది నకిలీ ప్రొఫైల్ అని తేలడంతో యాంకర్ ప్రణవ్కు త్రిష్ణ ఈ సమాచారం అందజేసింది. ప్రణవ్ తన ప్రొఫైల్ వాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని త్రిష్ణకు సమాచారం అందించాడు. అయితే ప్రణవ్పై ఇష్టం పెంచుకున్న త్రిష్ణ అప్పటినుంచి అతడిని ఫాలో చేయడం ప్రారంభించింది. ఫిబ్రవరి 11న అర్ధరాత్రి ఉప్పల్లో నలుగురు వ్యక్తులతో కలిసి ప్రణవ్ను కిడ్నాప్ చేయించింది.