హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా తెలంగాణ చరిత్ర గతినే మార్చివేసిందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో ’నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని గొప్ప మలుపు తిప్పిందని పేర్కొన్నారు.
యావత్తు తెలంగాణ ప్రజలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించిందని, ఢిల్లీ పీఠాన్ని కదిలించిందని తెలిపారు. దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రజలు తెలంగాణ ప్రగతికి పునరంకితమై కేసీఆర్కు అండగా నిలువాలని ఆయన పిలుపునిచ్చారు.