మాచారెడ్డి, ఆగస్టు 7 : అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఎస్సై సంతోష్కుమార్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కడెం మమత, నవీన్ దంపతులు. వీరికి 11 నెలల ఇద్దరు ఆడపిల్లలు మహాశ్రి, మహన్య ఉన్నారు.
అత్తింటి వేధింపులు భరించలేక మమత ఆదివారం తన ఇద్దరు కూతుళ్లకు విషం తాగించి ఆపై ఆమె కూడా తాగింది. గుర్తించిన కుటుంబీకులు, స్థానికులు కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా మహాశ్రి చికిత్స పొందుతూ చనిపోయింది. మరోపాపను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిలోఫర్కు తరలించారు. తల్లి మమత కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది.