జనగామ: బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) గెలుపును కాంక్షిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన నలుగురు యువకులు వేములవాడకు పాదయాత్ర చేపట్టారు. అత్యధిక మెజారిటీతో పల్లా గెలుపొందాలని జనగామ నుంచి వేములవాడకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. జనగామ పట్టణంలోని 9వ, 10వ వార్డుకు చెందిన ఆ యువకులు ఇవాళ ఉదయం వేములవాడ చేరుకున్నారు.
ఉదయమే రాజరాజేశ్వరుడిని దర్శనం చేసుకున్నారు. జనగామలో పల్లా విజయం సాధించాలని ఆ యువకులు రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. గిర్నిగడ్డకి చెందిన యువకులు అందె ధరణి ప్రకాష్, తాండ్ర శేఖర్, గోల్కొండ సాయి, ఉడుగుల రంజిత్ జనగామ నుంచి వేములవాడకు పాదయాత్ర చేపట్టారు.
జనగామలో పల్లా గెలుపును కాంక్షిస్తూ ఇవాళ జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని మండలాల్లోనూ గులాబీ దళ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో భారీగా ర్యాలీలు చేపడుతున్నారు. చీటకోడూరు గ్రామంలో గ్రామ అధ్యక్షుడు ఒంటెరు శ్రీనివాస్ రెడ్డి, మరియు సర్పంచ్ కొత్త దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మందితో భారీ ర్యాలీ తీయడం జరిగింది.