హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈనెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహిస్తున్నందున ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్స్లు బంద్ ఉండనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.