హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిని గెలిపించాలని టీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) పిలుపునిచ్చింది. గురువారం పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి హైదరాబాద్లోని సీపీఎస్ఈయూ కార్యాలయంలో సంఘం నేతలతో భేటీ అయి మద్దతు కోరారు. దీంతో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మద్దతు లేఖను శ్రీపాల్రెడ్డికి అందజేశారు.
పాత పెన్షన్ వ్యతిరేకశక్తులను అంతంచేయాలన్న తలంపుతోనే గుర్రం చెన్నకేశవరెడ్డికి తాము మద్దతు తెలియజేస్తున్నట్టు స్థితప్రజ్ఞ పేర్కొన్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 8వేల సీపీఎస్ టీచర్లున్నారని, వీరి మద్దతుతో గుర్రం చెన్నకేశవరెడ్డి గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.