సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి తలసాని
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటుచేసినట్లు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శనివారం ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన మత్స్యకారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని తెలిపారు. ఈ వృత్తిపై ఆధారపడిన గంగపుత్ర, ముదిరాజ్, తెనెగు, వాడ బలిజ తదితర కులాలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమయ్యేలా కృషిచేస్తామని తెలిపారు.