మెడలు వంచైనా కొనిపిస్తాం
మంత్రులు, ప్రజాప్రతినిధుల హెచ్చరిక
ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ స్థానిక సంస్థల్లో ఏకగ్రీవ తీర్మానాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30: తెలంగాణ రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేదంటే ఊరుకోబోమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు తదితర ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. బుధవారం కూడా పలు జిల్లా పరిషత్, మండల పరిషత్లు, మున్సిపాలిటీల పాలకవర్గాలు ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి జడ్పీ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మేడ్చల్ జడ్పీ సమావేశంలో మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని, దీన్ని జీర్ణించుకోలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనే వరకు ఊరుకొనేది లేదని హెచ్చరించారు.
బుధవారం తీర్మానాలు చేసిన స్థానిక సంస్థలు..