ఢిల్లీ : సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటి ముందు చేపట్టిన నిరసన కొనసాగుతున్నది. రాహుల్ గాంధీకి నచ్చ చెప్పేందుకు రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ రాహుల్ను బుజ్జింగించే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని కోరారు. దీనినికి రాహుల్ గాంధీ ససేమీరా అనడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 30 నిమిషాల పాటు రాహుల్తో చర్చించారు. ప్రధాని, హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జితేంద్ర సింగ్ అక్కడ నుంచి నేరుగా హోం శాఖ మంత్రి అమిత్ షా వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రతిపాదనలను వివరించారు.
కాగా, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ( CJP) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో(Delhi) నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మాకంగా మారింది. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించిన విషయం తెలిసిందే.